శివలింగాన్ని ఎందుకు పూజించాలి shiva stories telugu

శివలింగాన్ని ఎందుకు పూజించాలి 

ఒకరోజు సనత్కుమారులు సూతుడిని శివుడికి కాకుండా శివలింగానికి ఎందుకు పూజ చేస్తారు ఆ కథ ఏంటో వివరించమన్నారు దానికి
సూతుడు చెప్పడం ప్రారంపించాడు. ‘కలికాలం లోనే కాదు. ఏకాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు దేవుడి ఆరాధనలో మరో మార్గం కూడా వుంది.

అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంలోగాని, ఇంట్లో దేవతార్చనా పీఠంలోగాని, ఏదైనా ప్రత్యేక మందిరంలోగాని, పుణ్యక్షేత్రంలోగానీ-నిత్యమూ ఆరాధించు ఉన్న వారికి తప్పకుండ ముక్తి లభిస్తుంది.

అందులో ముఖ్యమైనవి ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, అభిషేక, వస్త్ర, భస్మ, గంధ, అక్షత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూల, మహానీరాజన మంత్రపుష్ప, నమస్కార, ప్రార్థనలనే నిత్యం అర్పించాలి. ఛత్రం, చామరం, తాళపత్రం, అద్దం, ఘంట, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది.

అలా రోజూ శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చేయలేనివారు-నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్రాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు.

శివుడొక్కడు మాత్రమే నిష్కలత్వంచేత లింగంగానూ, సకలత్వంచేత మూర్తిమంతంగానూ, ఆరాధింపబడతాడు.మిగిలిన దైవతాలన్నీ మూర్తిమంతాలూ, సాకారాలేగాని, పరతత్త్యమైన నిరాకారతను పొందలేకపోయాయి. శివుడే సర్వేశ్వరుడనడానికి యిదే ఆధారం మనకి.” అని సుతుడు చెప్తాడు.

shiva stories telugu

shiva stories telugu

అది విన్న మునులు మల్లి ఇలా అడిగారు. “నువ్వు చెప్పేది చాలా ఆశ్చర్యంగా వుంది. పరబ్రహ్మమైన ఆ శివుడు సకల, నిష్కలరూపాలు ఆడంబరాలు ఎందుకు పొందాడు? ఆ విషయం వినిపించు అని సనత్కుమారులు అడుగుతారు

అలా అడగగానే సుధ మహర్షి “చెబుతాను గతంలో మార్కండేయుడు యిదే ప్రశ్న నందిని అడగగా , దానికి నందికేశ్వరుడు, చెప్పిన సమాధానాన్నే మీకు ఎప్పుడు చెబుతాను వినండి” అని కథ ఆరంభించాడు ఈ కథ సూతమహర్షి సనత్కుమారులకి చెప్తున్నాడు.

నందీశ్వరుడు మార్కండేయుడితో సృష్టి ఆరంభం అయినా కాలంలో అప్పటికి విష్ణుమూర్తి, బ్రహ్మ, ఆదిశేషుడు వివిధ వారు సృష్టిలో ఉన్నారు అయితే విష్ణుమూర్తి హాయిగా శేషపాన్పు మీద నాలుగు చేతులతో ఎంతో అందమైన ముఖరవిధంతో నిద్రిస్తున్నాడు అదే సమయంలో ఐదు తలతో బ్రాహ్మ దేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు

అప్పటికే సకల సృష్టికర్త బ్రహ్మగా పేరుపొందారు దానితో కాసంత అహంకారం బ్రహ్మ దేవుడికి పెరిగిపోయింది అది శివుడి మాయ అని తెలియకుండా నేనే గొప్ప అనే భావనతోనే విష్ణువుతో బ్రహ్మదేవుడు ఏమయ్యా నాలుగు చేతులవాడా!

ఇంతటి సృష్టికర్తను నేనువస్తే, నన్ను లెక్క చేయకుండా, లేచి, మర్యాద చేయకుండా, నిదరోతున్నావా? అందరికి తండ్రిని నేను, గురువుని నేను, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని లే, లేచి నన్ను మర్యాద చెయ్యి అతిథిమర్యాద చేయనివారికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది తెలుసా? అన్నాడు.

దానితో విష్ణువుకి మండుకొచ్చింది మహావిష్ణువుకి తన బొడ్డులోంచి మొలిచిన తామరపువ్వు లోంచి పుట్టిన బ్రహ్మ అతడిని అవమానించడం విష్ణువుని నిర్లక్ష్యం చేయడం కానీ తనే తండ్రిననడం ఆయనకి అస్సలు నచ్చలేదు అయినా స్థితి కర్తకదా! అందుకని పైకి మాత్రం చిరు నవ్వులు నవ్వుతూ, బ్రహ్మదేవా! నీకు స్వస్థత కలుగునుగాక” అంటూనే బ్రహ్మకన్న తన ఆధిక్యతను చెప్పుకోసాగాడు

ఎప్పుడైతే ఆత్మస్తుతి మొదలుపెట్టాడో, అప్పుడే శివమాయ ఆక్రమించేసింది విష్ణుమూర్తికి. బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివమాయలో మునిగిపోయారు నువ్వెక్కువా? నేనెక్కువా? అనే వాదమల్లా నేనే సర్వేశ్వరుణ్ణి అంటే లేదు నేను సర్వేశ్వరుణ్ణి అనుకునే దాకా వెళ్ళిపోయింది. మాటామాటా పెరిగింది. చివరికి యుద్ధంగా పరిణమించింది.

విష్ణువువైపు విష్ణుగణాలూ, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలూ సమకూడి సమర శంఖారావం చేశాయి/ దేవతానీకం, దివ్యర్షిగణాలూ ఊర్ధ్వంలో నిలిచిపోయి ఉహించారని యుధాన్ని తిలకించసాగాయి. యుద్ధం యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతోంది. దానికి పరాకాష్టగా విష్ణువు మాహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. అదిచూచి బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు.

shiva stories telugu

shiva stories telugu

మూడులోకాలు వొణుకుతూ యుద్ధ ప్రభావానికి- దేవతలు దిమ్మెరపోయారు. ‘శివశివా, శివశివా, శరణు శరణు శివశివా’ అంటూ ఋషి, దేవగణాలు కైలాసానికి చేరాయి. సర్వశక్తి మంతుడా ఆ సదాశివుడు. వచ్చిన వాళ్ళను కాస్త ఓదార్చాడు వారికీ అభయమిచ్చాడు. అంతే శివుడు ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై, మాహేశ్వర, పాశుపతాస్త్రాలతో డీకొంటున్న బ్రహ్మ విష్ణువులనడుమ అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు.

మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ ప్రయోగించిన పాశు పతాస్త్రమూ-రెండూ కూడా ఆ తైజసస్తంభంలో విలీనమైపోయాయి. తుదీ మొదలూ తెలియకుండా-వెలుతురే వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా – ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులూ తప్పిపోయాయి.

బ్రహ్మవిష్ణువులు కళలు దప్పి కలతపడసాగారు. వారివారి అహంకారాలు అణగారిపోయి, అంతకుముందెన్నడూ కనీవినీ యెరుగని యీ అపూర్వ జ్వాలాస్తంభం వల్ల యేర్పడ్డ అద్భుతరసంలో మునిగిపోయారు. తానే సర్వజ్ఞుడననీ, తానే సర్వస్రష్టయనీ, తగువులాడుకున్న బ్రహ్మ విష్ణువులు ,ఇద్దరికి యీ అద్భుత వినూత్న తేజం పట్టుబడలేదు.

ఇది వాళ్ళు సృష్టించింది గాదు. వాళ్ళు ఎరిగినదికాదు. ఎలాంటి అవయవాలు లేకుండా అప్రమేయంగా, అనూహ్యంగా దేహం లేకుండా దానికి తుది మొదళ్ళు లేకుండా వున్న ఆ వెలుగు యొక్క మొదలు చివర తెలుసుకోవడమే బ్రహ్మ విష్ణువులకు సమస్యగా పరిణమించింది.

తక్షణమే ఇద్దరు తుది మొదలు తెలుసుకోడానికి బయల్దేరారు వాళ్ళు. దాని మొదలు తెలుసుకోవడం కోసం విష్ణువు శ్వేతవరాహమై – పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆ వెలుగు యొక్క తుది కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంతో ఊర్ధ్వానికి సాగాడు. ఎంత దొలుచుకుపోతున్నా కాని- “మొదలు దొరకక అలసిపోయాడు ఆదినారాయణుడు ఇక తనవల్ల కాదనుకొని- వెనుదిరిగి యుద్ధస్థలానికి చేరాడు.

పైకి వెళ్ళిన బ్రహ్మకి కూడా ఏమీ పాలు పోలేదు. ఆ నిట్టనిలువుకు తుదియొక్కడో చిక్కలేదు, కాని- సరిగ్గా అదే సమయానికి శివతైజస స్తంభాగ్రంనుండి ఒక మొగలిపువ్వు క్రిందకు పడుతూ కనిపించింది. బ్రహ్మ దానిని ఆపాడు, ఆ తరువాత మొగలిపువ్వుతో తన అన్వేషణ గురించి మొత్తం చెప్పాడు

“ఈ నిట్టనిలువు నిట్టకు అగ్రం నీకు తెలుసా? అని అడిగాడు. అందుకా మొగలిపువ్వు నవ్వి- “నేను వస్తున్నదే అక్కడనుంచి, కాలమానం రీత్యా అయితే చాలా యుగాలైపోయింది నేను అక్కడి నుండి జారి యిప్పటికి ఇక్కడకు చేరాను. ఈ లోపల ఈ స్తంభంయింకెంత పెరిగివుంటుందో నాకు తెలియదు, నా మాటవిను.

దీని అగ్రాన్ని చూడడం నీ తరంకాదు” అంది. దానికి బాధపడ్డాడు బ్రహ్మ. తుదికానకపోతే విష్ణువు ముందు లోకువైపోవాల్సివస్తుంది. లేదా విష్ణువుతో సమానుడవ్వాల్సి వస్తుందని అది తనకు నచ్చదు తను విష్ణువు కన్నా గొప్పవాడు అని అనిపించుకోవాలి.

అందుకని ఒక ఆలోచన చేశాడు. మొగలిపువ్వుని చూసి- ఓ కేతకీసుమమా! నువ్వు నాకో ఉపకారం చెయ్యి నేను విష్ణువు దగ్గరకెళ్ళి/ఈ స్తంభానికి ఎలా ప్రారంభం అయిందో నేను దాని అగ్రం సందర్శించానని చెబుతాను. నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి” అని ప్రాధేయ పడ్డాడు.

దానికి ‘సరే’ నంది మొగలిపువ్వు, కేతకీ బ్రహ్మలిద్దరూ పూర్వరణస్థలం చేరారు. ఎంతో దిగులుతో కూర్చుని వున్నాడు విష్ణువు అక్కడికి వచ్చాడు బ్రహ్మ, తాను ఆ వెలుగు స్తంభం పై భాగం చూశానని చెప్పాడు. మొగలిపువ్వే సాక్ష్యం అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లు ‘ఔ’నంది మొగలి పొత్తి, వెంటనే ఆశ్చర్యపోయాడు విష్ణుమూర్తి. “నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను నేనే “ఓడిపోయాను” అని తన ఓటమిని ఒప్పుకున్నాడు.

బ్రహ్మ ఆధిక్యతని అంగీకరిస్తూ అతనిని అర్ఘ్యపాద్యాదులతో ఆరాధించి ఆ తైజసస్తంభం దగ్గరే బెంగగా కూర్చుండి పోయాడు..

ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో, అప్పుడే అతనిని కప్పుకున్న శివమాయ తొలగిపోయింది. తన అహంకార పూరితమైన ప్రవర్తనకు పశ్చాత్తాప పడి ఎంతో బాధపడి “శివశివా” అనుకోసాగాడు. అప్పటికే బ్రహ్మ చేసిన తప్పుకి శివుడు బ్రహ్మను శిక్షించాలి అని నిర్ణయించుకొని విష్ణువు చింతించడంతో శివుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు.

shiva stories telugu

తక్షణమే నిష్కళమైన అగ్ని స్తంభం నుండే సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. సిగలో జాబిల్లినొసటకన్ను, నీలకంఠం నాగాభరణాలూ, త్రిసూలం, మరొకచేత అభయ ముద్రతో సాక్షాత్కరించాడాయన, కళ్ళముందు నిలిచిన శివుడిని విష్ణుమూర్తి వీక్షించాడు. భక్తి సంభరిత మానసం తోనూ ఆనందకంపితమైన ఆయనను స్తోత్రం చేశాడు. ఆ ధ్యానించగానే శివుడు విష్ణువుకి అభయంఇచ్చాడు.

“నారాయణా! నువ్వు కూడా ఒకచిన్న అబద్దం చెప్పి ఉంటే బ్రహ్మకన్నా నువ్వే యెక్కువగా చెలామణి అయ్యేవాడివి. అయినా నువ్వు అసత్యం చెప్పలేదు.
నీ సత్యసంధత నన్ను సంతుష్టుణ్ణి చేసింది. సత్యమే శాశ్వతమయినది. ఎవడు సత్యాన్నే ఆశ్రయిస్తున్నాడో వాడేశాశ్వతుడు. ఇకనుండి ఊర్ధ్వమధ్యమ, అదో లోకాలు అన్నింటా కూడా నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు. నావలెనే నీకూ క్షేత్రాలు యేర్పడతాయి. పూజలూ, ఉత్సవాలూ అన్నీ లభిస్తాయి. లౌకిక జగత్తులో నాయంతటి వాడివిగా ఆరాధింపబడతావు” అని దీవించి వరాలు అనుగ్రహించాడు.

శివుడు బ్రహ్మకు శిరచ్ఛేదము విధించుట

శిష్టుడైన శ్రీహరిని అను గ్రహించిన తరువాత, దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్ప దలచాడు భవుడు, తక్షణమే తన సంకల్పంతో భైరవుడిని సృష్టించాడు. “భైరవా! అసత్య పరుడైన ఆ బ్రహ్మని నీకత్తివాదరతో తగినట్లు సత్కరించు” అన్నాడు శంకరుడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కలిగించే తనపదును కత్తిని ఉపయోగించి ఒకచేత బ్రహ్మదేవుడి కొప్పుబట్టి! ఆబద్ధం

ఆడిన అతగాడి ఐదవతలకాయను నరికేశాడు. తక్కిన తలలు కూడా నరికేయడానికి సిద్ధపడుతుండగా, బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడి పోయి. “శివ శివా, భవ భవా, హరహర” అని ఆర్తనాదాలు చేసుకుంటూ భయపడుతూ వచ్చి శివుడి పాదాలమీద పడ్డాడు. అలా వణికిపోతున్న విధాతపరిస్థితి చూసి విష్ణుమూర్తికి కూడా జాలి కలిగించింది.

ఎంతైనా ఆయన బొడ్డు తామరనుంచి వెలువడ్డబుడ్డడు గదా ఆపితామహుడు! అందుకే కాబోలు విష్ణువు శంకరునకు అంజలి ఘటించి మ్రొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు. అంతకన్నా దీనంగా ప్రాణభిక్ష నర్థిస్తున్నాడు బ్రహ్మ/ దయదలిచాడా జీవకోటికి ప్రాణం పోస్తాడు అని.

ఓయీ బ్రహ్మదేవా! నువ్వింతగా ప్రాధేయపడుతున్నావు గనుక. విష్ణువు మరీ మరీ చెబుతున్నాడు గనుక యిప్పటికి క్షమిస్తున్నాను. నీవ్వు సృష్టికార్యక్రమంలో పుండు. కాని,నీవు చేసిన తప్పు వాళ్ళ నువ్వెక్కడా పూజార్హుడివి కాకుండాపోతావు. కాని నా భక్తుడవు గనుక, నన్నే నిరంతరం చింతన చేస్తావు గనుక ఒక్కవరం యిస్తున్నాను

యజ్ఞయాగాదులూ మొదలైన వేదోక్త కర్మలో మాత్రం నువ్వే గురువుగా గౌరవింప బడతావు అలా కాదని నిన్ను తీరస్కరించి చేసే యాగాది క్రతుకాండలేవీ కూడా ఫలితాలనీయవు” అని చెప్పాడు.

శివుడు మొగలి పువ్వును శపించుట

ఆ తరువాత తడబడుతూ తడబడతూ నిలబడ్డ మొగలిపువ్వును చూసి ఓసి కేతకీ! కూటసాక్షిపై కుసుమజాతికే కళంకం తీసుకొని వచ్చావు ఇక నుండి   నువ్వు నాకు అయిష్టురాలవు. అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుందిఅని శివుడు శపించాడు. మత్తెక్కించే పరిమళాల మొగలి పువ్వుని దేవతలూ, ఋషులూ,లోకులందరూ దానిని.

ధరిస్తుండే వారు అటు వంటిది. శివుడు దానిని శపించగానే వారంతా తమతమ వద్దనున్న మొగలి పువ్వుల్ని దూరంగా నెట్టేశారు వేశారు.  ఈ శాపం వెనువెంటనే తనపట్ల తిరస్కారం చూసేసరికి, మొగలిపువ్వు తట్టుకోలేకపోయింది.

మొగలిపువ్వు శివుడికి మొరపెట్టుకుందిహే జగన్నాధా! నీ సేవకు నోచని నా జన్మమే వృధా అయిపోతుంది. నాయందు కరుణించు, ఎంతటి పాపాత్ములకైనాసరేశివఅనే నీ నామస్మరణ మాత్రం చేతనే ముక్తి లభిస్తూవుండగా, సాక్షాత్తూ నీ నిష్కల, సకలరూపాలు రెండింటిని దర్శించుతూన్న నా యొక్క ఒక్కగాని ఒక్క అసత్య దోషాన్ని ఇంకా మిగల్చి ఉంచుతావా తండ్రీఅని పరిపరివిధాల ప్రార్థించింది.

ఇక  జాలికి దయ  మొగలిపువ్వు మీద కలిగి ఈ జంగమయ్య  పువ్వును క్షమించాడు. ‘కేతకినేను అన్నది అన్నట్లుగా జరగాల్సిందే నా ఆరాధనా నిషిద్ధమైనప్పటికీ కూడా, నీవు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకో బడతావు. నా పూజలోకి పనికిరాకపోయినా కూడా, నాకు పై కప్పుగా అలంకరించడానికి నీవు ఉపయోగిస్తారని అనుగ్రహించాడు.

శివరాత్రి మాహాత్మ్యము

ఆవిధంగా బ్రహ్మ విష్ణుగణాల వారూ కూడా  మెల్లమెల్లగా శివ దర్శనార్ధం శివుడి దగ్గరకు వెళ్లేవారు. వారందరినీ వెంట బెట్టుకుని బ్రహ్మ విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు. అలా వారి పూజకు పొంగి పోయాడు భోళాశంకరుడు. ఆ ఆనందంలో శివుడుమీరిద్దరూ కలిసి యీనాడు నాకు చేసిన యీ పూజతో నేనెంతో సంతుష్టుడి నయ్యాను. కాబట్టి ఇకనుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతిపాతమైమహాశివరాత్రినామంతో విరాజిల్లుతుంది.

ఇకనుండి శివరాత్రినాడు శివలింగం రూపంలో గాని, మూర్తి రూపంలో గాని, నన్ను ఆరాధించిన వారు పురుషోత్తముడవుతాడు. మహాశివరాత్రి Rojunaa రాత్రి  ఉపవాసం ఉండి, యింద్రియాలని అదువులో ఉంచుకుని త్రికరణ శుద్ధిగా, లోపం లేకుండా, విధివిధానంగా నన్నారాధించినవాడు ఒక సంవత్సర మంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు.

ఈరోజు శివప్రతిష్ఠకూ, శివ కళ్యాణానికీ శ్రేష్ఠమైనరోజు అవుతుంది. మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిర మాస బహుళ చతుర్దశీ ఆల్ట్రా నక్షత్రం నాడు నా శివలింగాన్నిగాని దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామికన్నా యిష్టుడవుతాడు.

నేను లింగాకృతితో ఉద్భవించిన యీ ప్రదేశం లింగస్థానం అనబడుతుంది. అది అంతం లేని  ఈ అనలస్తంభం శివలింగంగా సిద్ధిస్తుంది. ఈ అనలస్తంభం ఆవిష్కరింపబడిన ఈ నేలఅరుణాచలంగా ప్రసిద్ధిమవుతుంది.

శివక్షేత్రాలన్నిటా యిది అత్యంత కీర్తిమంతమవుతుంది. ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా ఆవిష్కరింపబడే శివలింగారాధకులు సాలోక్య, సామీప్య, సాయుజ్యాది మోక్షపదాలను క్రమశ, పొందగలుతారుఅని పలు విధాలుగా అను గ్రహించి తుదిగా యిలా చెప్పసాగాడు శివుడు.

విష్ణు విధాతలారా! నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికే నిరాకారమూ, నిర్గుణమూ, నిరుపమానమూ, అసరిమాణమూ అయిన రూపంలో కపించాను. అంతే కానీ , మీకున్న సాకారతా అహంభావాన్ని తుద ముట్టించేందుకు సకలుడనై / ఈ లింగరూపంతో మీకు దర్శనం యిచ్చాను గుర్తుంచుకోండి.

కాబట్టినేనేపరబ్రహ్మననిమరచిపోకండామీలోమీరుతగవులాడకండానాఆజ్ఞాప్రకారంసృష్టి, స్థితులను నెరవేర్చండి. లింగానికీ మూర్తికీగాని నాకు విధమైన భేదమూ లేదు. నిత్యం లింగారాధన చేయండి. నిజానికి నేనేదో ఒకచోట ఉండిపోయే వాడినికాదు అయినా కూడా ఎక్కడ లింగప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను.

ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివసమానులై కైలాసాన నివసిస్తారు. రెండు శివలింగాల్ని ప్రతిష్టిస్తే మహా కైలాసమున శివా నందానుభవులై శివసాయుజ్యం పొందుతారు. లింగప్రతిష్ఠ అత్యంత ప్రధానమైనది. లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్టించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది.

ఈ కథ సంపూర్ణ శివ పురాణ గ్రంథం నుండి గ్రహించబడింది ఇందులో ఎలాంటి సొంత వాక్యాలు లేవు కేవలం కథ అర్ధం కోసం కష్టమైనా పాదాల తీసేసి సులువు పదాలు మాత్రమే వాడడం జరిగింది. ధన్యవాదాలు

 

Leave a Comment