moral stories in telugu త్రిపురాదేవి కథ…

moral stories in telugu

త్రిపురాదేవి కథ:

పూర్వం సరస్వతి నది ఒడ్డున సుమంతుడనే బ్రాహ్మణుడు, తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతడు దుర్గాదేవి ఉపాసకుడు, అయితే వారి కాలంలో భార్యని పేరుతో పిలవకూడదునే నిబంధన ఉంది

దాని కారణంగా తన భార్యని సుమంతుడుఅయిఅని పిలుచుకునే వాడు. వారి కుమారుడు అలర్కుడు అయితే ఈ అలర్కుడు తన కర్మల వల్ల 5 సంవత్సరాలకే వ్యాధితో భాదపడుతూ తల్లిని, , , అని పిలుచుకుంటూ చనిపోతాడు.

ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఈ బాలుడే హరితాయన వంశంలో  సుమేధుడుగా పుడతాడు.

ఈ సుమేధుడు పరశురాముడుకి శిశుడిగా ఉంటాడు, అయితే ఒకరోజు ఈ పరశురాముడిని సుమేధుడు ఒక ప్రశ్న అడుగుతాడు, అది సంసారం మీద విరక్తి చెందిన వారు దీనులైన మనుషులకు శ్రేష్టమైన సాధన ఏదైనా ఉందా గురుదేవా అని అడుగుతాడు, దానికి పరుశురాముడు త్రిపురాదేవి రహస్యం శివుడు విష్ణుమూర్తికి చెప్పాడు.

విష్ణువు తన అంశంలో దత్తాత్రేయుడికి చెప్పాడు, దత్తాత్రేయుడు నాకు చెప్పాడు నేను నీకు పుష్య నక్షత్రంలో చెప్తానని, నీవు దీనిని విని గ్రంథముగా రాయాలని చెప్పి పుష్య నక్షత్రంలో శ్రీబాలాత్రిపుర సుందరీదేవి యొక్క మూడు రూపాలన్నీ ఉపదేశం చేస్తాడు.

moral stories in telugu

ఆ తరువాత త్రిపురాదేవి రహస్యము గ్రంథంగా రాయడానికి సుమేధుడు శ్రీశైలం వెళ్లి అక్కడ భ్రమరంభాదేవి సన్నిధిలో ఒక కుటీరంలో ఉంటూ పండ్లు మాత్రమే తింటూ తన ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మొదట తొమిది నెలలు, ఆ తరువాత అయిదు  నెలలు, ఆ తరువాత మూడు నెలలు ఇలా శ్రీబాలాంబికను ధ్యానిస్తున్నాడు.

ఒకరోజు సుమేధుడి కలలో పది సంవత్సరాల వయసు కలిగి నాలుగు చేతులతో, మూడు కళ్ళతో ఎంతో సౌదర్యంగా భలంభికాదేవి  సుమేధుడికి దర్శనమిస్తుంది.

సుమేధుడు ఆశ్చర్యంతో ఆనందంగా కలలోనే అమ్మని దర్శించుకొని నిలుచున్నాడు, కలలోనే అమ్మవారు నీవు కోరుకున్న సిద్ది నీకు దక్కింది ఇక ఆలస్యం చేయకుండా ని గురువు దగ్గరికి వేళ్ళు అని చెప్పి మాయమైంది.

ఇక ఆ కల గురించే ఆలోచిస్తూ అది నిజమో అబద్దమో నాకు తేలడం లేదు అని నదిలో స్నానం చేస్తూ అమ్మవారు చెప్పినాక నేను ఎందుకు వినను అని న గురువుని కలవాలి అనుకుంటూ అసలు కలలో చెప్పింది నిజమో కాదో అని అక్కడే దేవి వచ్చేవరకు తపస్సు చేస్తాను అని కుర్చీన్నాడు ఆకాశంలో నుండి ఒక స్వరం ఆ కల గురించి సందేహం వద్దు అని దానిపై విశ్వసం ఉంచు అని వినిపిస్తుంది. 

ఈ సుమేధుడు కళ్ళు తెరిచి  చుట్టు చూస్తే ఎవ్వరు ఉండరు, ఇక పరుగు పరుగున తన గురువు పరుశురాముడు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తాడు. పరుశురాముడు నేను ముందే నా జ్ఞానదృష్టి తో చూశానని సుమేధుడికి శ్రీవిద్యను ఉపదేశించి దీనిని దీక్ష చేసాడు.

ఆ తరువాత తంత్రసారం ఇతిహాసంలో శ్రేష్ఠమైన త్రిపుర రహస్యం బోధించి దీనిని రహస్యంగా ఉంచి నాస్తికుల వద్ద, భక్తి హీనుల వద్ద దీని గురించి మాట్లాడకు అని చెప్తాడు. ఆ తరువాత దీనిని గ్రంధముగా రచించి అర్హులైన శిషులకే ఇవ్వమని చెప్తాడు.

ఆ తరువాత ఈ సుమేధుడు శ్రీసుందరేశ్వర పత్ని అయినా మీనాక్షిదేవి వెలిసిన హాలాస్యపురము దగ్గర వేగావతి నది సమీపంలో సువర్ణపద్మిని తీరంలో శ్రీత్రిపుర మహేశ్వరిని ధ్యానిస్తూ ఒక గొప్ప తపస్సు చేసాడు, ఆలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు సుమేధుడి తపస్సులో ఉండగా తన ధ్యానంలోనే ఒక వ్యక్తి శరీరం నిండా భస్మంతో కర్పూరంలాగా తెల్లగా ప్రకాశిస్తూ జాడలు చేతిలో విణ వాయిస్తూ నిలుచున్నాడు.

కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యంగా నారద మహర్షి ఎదురుగా ఉన్నాడు దానికి సుమేధుడు సంతోషంతో ప్రణామాలు చేసి నారదుడితో దేవర్షి బయట నిలబడ్డ నీవు నేను తపస్సులో ఉండగా నా లోపల ఎలా కనిపించావు అని అడిగాడు అప్పుడు నారదుడు, సుమేధుడితో నీవు ఇంత విద్యంసుడవు ఇదేమి ప్రశ్న? లోపల ఏమిటి, బయట ఏమిటి, దేనికి ఏది లోపల ఉంది, దేనికి ఏది బయట ఉంది.

నీవు నన్ను లోపల చూస్తే ఏమిటి, బయట చూస్తే ఏమిటి. ఈ ప్రశ్నల వాళ్ళ నీకేమి లాభం ఇప్పుడు నేను బ్రహ్మలోకం నుండి నిన్ను చూడడానికే వచ్చాను, నేను మార్కండేయుడు బ్రహ్మ దేవుడిని అన్ని పురాణాలలో ఏది అన్నిటికంటే సారమైనది అని అడిగాడు, అప్పుడు బ్రహ్మ దేవుడికి త్రిపురాదేవి గుర్తుకువచ్చింది.

వెంటనే బ్రహ్మ లేచి పరాశక్తికి సాష్టాంగ ప్రణామం చేసి  ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా విను మార్కండేయ ఎవరైతే దీని పట్ల అశ్రద్ధ వహిస్తారో వారు ఈ లోకంలో నిలవలేరు, నేనుకాని విష్ణువుకానీ శివుడు కానీ ఆ పరాశక్తి ముందు ఒక చిన్న రేణువులం మాత్రమే, ఈ సకల జగత్తుకు కారణం త్రిపుర మహేశ్వరి దేవినే సకల ప్రాణకోటికి ఆత్మ పరాశక్తి.

ఆమె గురించి తెలుసుకోవడమే సర్వ విజ్ఞాన సారము త్రిపురాదేవి గురించి శివుడు, విష్ణువుకు, విష్ణువు తన అవతారంలో దత్తాత్రేయుడికి అలాగే దత్తాత్రేయుడు పరుశురాముడికి, పరుశురాముడు తన శిశుడైన సుమేధుడికి బోధించారు. ఇప్పుడు సుమేధుడే త్రిపురాదేవి గ్రంథం రాయబోతున్నాడని తెలిసి నేను నీ దగ్గరికి కుతూహలంగా వచ్చాను సుమేధ అని నారదుడు అంటాడు.

moral stories in telugu

నారదుడి మాటలు విని సుమేధుడు దినంగా నారదుడితో నేనేమి సమాధానం చెప్పాలో నాకు తెలియడంలేదు మార్గం నేవే చెప్పు అని నమస్కరిస్తూ  గ్రంథం రచించమని నా గురువు అయినా పరశురామ ప్రభువు నాకు ఆజ్ఞను ఇచ్చిన మాట నిజమే కానీ పరశురామ ప్రభువు చెప్పేటప్పుడు  నేను మొత్తం తిపురాదేవి రహస్యం విన్నాను కానీ నా మందబుద్ధి వల్ల మొత్తం మరిచిపోయానని.

అందుకే గ్రంథం రచించడంలో ఇంత ఆలస్యం జరుగుతుందని నారదుడితో సుమేధుడు చెప్తాడు. అప్పుడు నారద మహర్షి చాలాసేపు ఆలోచించి బ్రహ్మదేవుడిని ప్రార్ధించాడు. అప్పుడు బ్రహ్మ అక్కడి వచ్చి ఎం కావాలో చెప్పు అని నారదుడిని అడుగుతాడు.

దానితో నారద మహర్షి తండ్రి నీవు మార్కండేయుడికి చెప్పిన మాటలు విని నేను సుమేధుడి దగ్గరకు వచ్చాను కానీ నాకొక సందేహం వచ్చింది ప్రభూ అని  ఈ సుమేధుడు ఏ పుణ్యం వల్ల ఇతనికి త్రిపురాదేవి గ్రంథానికి గురువు అయ్యాడని, బ్రహ్మ దేవుడిని నారదుడు అడుగుతాడు.

అప్పుడు బ్రహ్మ సుమేధుడు పూర్వ జన్మలో తన తల్లిని ఐ,, అని పిలుస్తుండేవాడు. ఇతను చనిపోయే ముందుకూడా ఐ, , అనే పలికాడు, అయితే శ్రీ బాలా త్రిపురసుందరి దేవి మంత్రంలో ఐo అనేది మొదటి అక్షరం. దానిని ఇతను పదేపదే పలకడం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఈ జన్మలో ఇతనికి కలలో మహాదేవి దర్శనం ఇచ్చింది.

ఆ బీజాక్షరంను పూర్వ జన్మలో పలకడం వాళ్ళ అఖండ పుణ్యం లభించింది. కానీ ఆ ఐ అనే పదం పలికేటపుడు తనకు 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి అందులోటి ఐ అనే పదం అమ్మవారి మంత్రంలోని పదం అనే జ్ఞానం తనకు లేదు కాబట్టే ఈ జన్మలో తనకు స్వయంగా విన్న సోత్రాలు, అలాగే త్రిపురాదేవి రహస్యం గుర్తుకులేదు అని బ్రహ్మ నారదుడితో అంటాడు.

ఆ తరువాత బ్రహ్మ ఈ జన్మలో ఇతను చేసిన తపస్సు వల్ల అలాగే పూర్వ జన్మలో త్రిపురాదేవి బీజాక్షరం స్మరించడం వల్ల ఇప్పుడు ఇతను త్రిపురాదేవి గ్రంథాన్ని రచిస్తాడని చెప్పి ఇకనుండి సుమేధుడికి గురువు వాళ్ళ విన్నది కానీ ఇతను స్వయంగా చూసినవి అలాగే భూత, భవిషత్తు వర్తమానంలోని సంఘటనలు, అలాగే వ్యక్తుల ఆకృతులు ప్రవర్తనలు వారి స్వభావాలు అన్ని తాను తలుచుకోగానే గుర్తుకు వస్తాయి అని బ్రహ్మ దేవుడు సుమేధుడికి వరం ఇస్తాడు.

moral stories in telugu

Leave a Comment