విష్ణుమూర్తి చెప్పిన బ్రహ్మ సత్యం moral stories in telugu

నారద మహర్షి సందేహం moral stories in telugu

చాలా మందికి ఒక అభిప్రాయం మనుసులో ఉండిపోతుంది అదే ఎక్కువగా పూజలు చేసేవారికే చాలా కష్టాలు బాధలు వస్తాయి అని ఎలాంటి పూజ చేయకుండా ఉన్న వారికీ సుఖాలు సంతోషాలతో ఆనందంగా బతుకుతుంటారని అనుకుంటూ ఉంటారు అయితే ఈ ప్రశ్న ఒకరోజు  నారద మహర్షి తన ఇష్ట దైవం అయినా విష్ణుమూర్తిని అడుగుతాడు అదేంటో ఈ వీడియోలో చూదాం

ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించాడు. అది స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం మీ నామస్మరణా చేసేవాళ్ళకి ఎప్పుడు కష్టాలతో దుఃఖంతోనే మిగులుస్తున్నారు, అసలు కనీసం  దీపం పెట్టకుండా హారతి ఇవ్వకుండా ఏ దాన ధర్మాలే చెయ్యని వారికీ అన్ని సుఖాలను, ఆనందంగా బతికే అదృష్టాన్ని ఇస్తున్నారు అని అడుగుతాడు.

దానికి విష్ణుమూర్తి నారదుడితో  ఓ నారద మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. దానికి నారదుడు సరే అని శ్రీమహావిష్ణువు  నారదుడు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో తిరుగుతూ ఉండగా వారికీ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది.

ఇక ఇద్దరు ఆ భవనం ముందుకు వెళ్లారు ముందుగా శ్రీమహావిష్ణువు మాయ రూపంలో ఉండి వారి ఇంటి ముందు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. దానికి ఆ ఇంట్లోని వ్యక్తి బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు  మళ్ళీ శ్రీమహావిష్ణువు మాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కావాలి మీరు ఇవ్వగలరా అని అడిగాడు.

దానికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఉంది నీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచిపెట్టారా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి అని అంటాడు మేము యాత్రికులము బిక్షం అడుగుతున్నాం అని మళ్ళి మహావిష్ణువు అంటాడు, అప్పుడు ఆ వ్యక్తి ఉంది వెళ్ళండి బయటకి అని నేటివేస్తాడు. దానికి విష్ణుమూర్తికి మహాభక్తుడైన నారదుడికి విపరీతమైన కోపం వచ్చింది దానితో విష్ణుమూర్తిని నారదుడు చెయ్యి పట్టుకొని బయటకి తీసుకొచ్చాడు,

తరువాత నారదుడు విష్ణుమూర్తితో అతడాన్ని మాటలు అంటుంటే మీరు మౌనంగా ఉన్నారు స్వామి అతడిని తక్షణమే శపించండి అని కోరుకుంటాడు. దానికి విష్ణువు సరే అని చెప్పి తన చేతులు పైకి ఎత్తి నీకు నాలుగు వైపులా ధనం, రావాలి ని వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలని మీ ఇంట్లో సంపద పెరగాలని వరం ఇస్తాడు.

అప్పుడు నారద మహర్షి చేతులు జోడించి దండంపెట్టి స్వామి మిమ్మలిని తిట్టి బయటకుపో అని అవమానించిన ఆ వ్యక్తికి, లక్ష్మి వృద్ధి చెందాలని వరం ఇస్తరేంటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి నారద ఎక్కడినుండి వెళ్దాం పాద అని అక్కడి నుండి కొద్దిదూరం వెళ్తారు. కొద్దిసేపటికి వారికీ ఒక పూరిగుడిసేలో ముసలి అవ్వని చూసారు.

ఆ ముసలి అవ్వ దగ్గరికి నారద మహర్షి, విష్ణుమూర్తి వెళ్లి మాత భిక్షందేహి అని అడుగుతారు. తల్లి మాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటె పెట్టండి తల్లి అని విష్ణుమూర్తి  అంటున్నాడు.

అప్పుడు కూర్చొని ఉన్న  ఆ ముసలి అవ్వ లేచి నాయనలారా! మా ఇంట్లో తినడానికి ఏమి లేదు కానీ నాకు ఒక ఆవు ఉంది, దానికి నిత్యం నేను సేవ చేయడం వాళ్ళ అది నాకు కమ్మనైన పాలను ఇస్తుంది. నా దగ్గర ప్రసుతనికి ఆ పాలు మాత్రమే ఉన్నాయి, కాబట్టి పాలు మీకు కావాలంటే రండి నా ఆదిత్యం తీసుకోండి అని ఈ ఇద్దరికి ఆసనం వేసి కూర్చోమని చెప్తుంది.

దానితో విష్ణుమూర్తి, నారదుడు కూర్చున్నారు ఇక పాలు వారికీ ఇచ్చింది, అది చూసి నారదుడు ఈ ముసలవ్వ ఎంత మంచిదో తనకి లేకపోయినా ఉన్న వాటితో మమ్మలిని కూర్చోబెట్టి ఆదిత్యం ఇచ్చింది.

కానీ భవనంలో ఉన్న వ్యక్తి మాత్రం ముఖం మీదనే పో పో అని వెళ్ళగొట్టాడు అని మనసులో అనుకోని. స్వామి ఈ ముసలవ్వకి మంచి ఆశీర్వాదం ఇవ్వండి అని నారదుడు అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన చేతులు పైకి ఎత్తి నీకు ఉన్న ఈ ఆవు చనిపోవాలి అని దీవించాడు. దానికి ఆశ్చర్యపోయిన నారదుడు ప్రభు తిట్టిన వాడికే వరం ఇచ్చిన మిమ్మలిని చూసి ఎంతో పొంగిపొయాను.

కానీ ఈమెకి తినడానికి ఉన్న ఒకేఒక్క ఆధారం ఆ ఆవునే, కాబట్టి మనలని  పిలిచి ఆదిత్యం ఇచ్చిన ఆమెకి తాగడానికి పాలు కూడా ఉండకుండా ఏంటి స్వామి మీ ఈ లీల నాకు అర్ధంకావడం లేదు ప్రభూ . దీనిని వివరించండి అని వేడుకుంటాడు.

దానికి విష్ణుమూర్తి నారద మహర్షితో ఇలా అంటున్నాడు. ఈ ముసలావిడ రోజు నా నామస్మరణే  చేస్తుంది. నిత్యం తన మనసులో నన్ను తలుస్తునే ఉంటుంది. కానీ తన ఇంట్లో ఉన్న ఆవు మీద తాను చాలా ప్రేమ పెంచుకుంది.

తన ద్యాస మొత్తం ఆ ఆవు మీద నే ఉంది. నేను లేకపోతే ఈ ఆవుని ఎవరు చూస్తారో అని, నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఆవు మీద ఉన్న ప్రేమతో ఈ ముసలవ్వ చనిపోతే దానిమీద ఉండే మొహం వాళ్ళ ఆమె నా సన్నిధికి రాలేదు. వైకుంఠానికి ఆమె చేరుకోలేదు. కాబట్టేఆమెబతుకున్నపుడేఆవు

చనిపోతే దాని మీద ఉన్న  వ్యామోహం పోయి పూర్తి భక్తి భావనతో నా సన్నిధికి చేరుకుంటుంది అని అలా దీవించాను.

ఇక ఆ భవనంలో ఉన్న వ్యక్తికీ ధనం మీద చాలా వ్యామోహం ఉంది. అందుకే అతనికి లక్ష్మివృద్ధి చెందాలని వరం ఇచ్చాను. ఇక అతను ఆ దనం మొత్తం మూటలు కట్టి చివరికి ఒకరోజు మరణిస్తాడు. చనిపోయే ముందు కూడా ఆ డబ్బు మీద ధ్యాసతో, డబ్బు మీద ప్రీతితో, డబ్బు గురించిన ఆలోచనలతోనే అతడు మరణిస్తాడు.

దాని కారణంగానే వచ్చే జన్మలోను ఒక పాములాగా తాను పుట్టి ఆ సంపద దగ్గరనే కాపలాగా ఉంటాడు, కానీ ఎప్పటికి భగవంతుడి సన్నిధికి చేరుకోలేడు. అందుకే కష్టాలు రాగానే భగవతుడిని కోరుకొని, కోరిక తిరక భగవంతుడిని మరిచిపోతాం, నిజానికి భగవంతుడు ఎవరికీ ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు.

అది తెలియక 24 గంటలు ఎదో ఆలోచించుకుంటూ మనం ఉంటాము, సత్యం తెలియక వ్యర్ధమైన వ్యామోహాలలో  మునిగిపోతాము, ఎప్పుడు డబ్బు, డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుడి స్మరణ చేయకుండా ఉంటాము.

ఇప్పటికైనా భగవంతుడిని నిందించకుండా, భక్తి శ్రద్దలతో  భగవంతుడిని ఆరాధించండి, మన మనసులోనే కొలువు తీరిన భాగవతుడు తప్పక మన భక్తికి మెచ్చి మనకు ఏది కావాలో స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు.

Leave a Comment