క్షుపుడు, దధీజీ మహర్షి కథ Moral stories in telugu
ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచుకున్న ఇష్ట దేవుణ్ణి మనుసులో తలుచుకున్నపుడు వచ్చే తృప్తి వేరు అలా అని వేరే దేవుళ్ళు తక్కువనా అని అడిగితే కాదు నిజానికి విష్ణువు అయినా శివుడైనా ఒక్కరే అలాగే లక్ష్మి అయినా గౌరీ అయినా ఒక్కరే ఈ కథ ఏ రూపంలో దేవుడిని తలిచినా ఆ రూపంతో పరమాత్మని చేరుకుంటామే కానీ విష్ణుమూర్తి గొప్ప శివుడు గొప్ప అని కాదు. ఈ కథ శివకేశవులు ఒక్కరే అని తెలుపుతుంది. ఇక కథలోకి వెళితే….
పూర్వం క్షుపుడు అనే మహారాజు తన రాజ్యం ఏ లోటు లేకుండా పరిపాలిస్తున్నాడు, ఈ క్షుపుడు మహా విష్ణు భక్తుడు అలాగే మరొక వైపు భృగు వంశంలో పుట్టినా దధీజీ అనే మహర్షి ఉండేవాడు ఇతడు మహా శివ భక్తుడు.
అయితే క్షుపుడు అనే రాజు , దధీజీ మహర్షి ఇద్దరు కలిసి తరుచుగా వారి ఆత్యాద్మికమైన విషయాలపైనా చర్చలు జరుపుతూ ప్రతి విషయాన్నీ క్లుప్తంగా విచారించేవారు. అలా చాలా కాలం ఎన్నెనో విషయాలను పరిశీలిస్తూ వాటికీ సమాధానం ఇచ్చే వారు. ఒకరోజున అనుకోకుండా ఈ క్షుప రాజు దధీజీ ఆశ్రమానికి వెళ్ళాడు,
ఆ ఆశ్రమంలో శివుడికి సంభందించిన కొన్ని వస్తువులని చూసి రాజుకు ఒక సందేహం వచ్చింది. దానితో ఈ క్షుపుడు, దధీజీ మహర్షిని ఇలా అడుగుతున్నాడు, మునింద్రా ఈశ్వరుడు ఈ దిక్పాలకులలో ఒక వ్యక్తి. కానీ విష్ణువు మాత్రం సర్వవ్యాప్తి గా దేవుడు అంతేకాకుండా లక్ష్మీపతి కూడా మరి నీవు విష్ణువుని కాకుండా ఈ భిక్షమెత్తుకునే వాడైనా శివుడిని ఆరాధించడం ఏమిటి.
ఇతనికి ఇల్లు వాకిలి అనేదే లేనివాడు, శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు, అభరణాలు ధరించాడు పాములు మేడలో వేసుకొని తిరుగుతాడు ఇతడిని ఆరాధించడం వింతగా ఉంది అని అంటాడు.
ఆ మాట విన్న దధీజీ మహర్షి రాజా క్షుప శివుడు ఏ పని చేసినా దానిని అర్ధం చేసుకోవడం సామాన్య విషయం కాదు. భిక్షాటన వెనక ఎంతో అర్ధం ఉంది ఇల్లు వాకిలి లేవు అంటే భవబంధాలు ఏవి లేనట్టే, శ్శశానంలో ఉండడానికి కారణం మరణం తరువాత అందరూ అక్కడికే చేరుకోవాలనే అర్ధం.
శివుడు భస్మధారణ చేస్తాడు దానికి కారణం మనిషి జీవితంలో ఎంత ఆడంబరాలకు పోయినా ఎంత గొప్పగా బతికి చివరికి మిగిలేది బూడిద మాత్రమే అని భస్మధారణ తెలియజేస్తుంది.
Moral stories in telugu
శివుడి గురించి ఏ విషయాలు తెలియకుండా నిందించడం నీకు సరి కాదు అని దధీజీ మహర్షి అంటాడు. అయినా కటిక పేద వాడికి లంక నగరం ఇచ్చి రావణాసురిడి వల్ల లంక పోగొట్టుకొని ఉన్న కుబేరుడికే నవనిధులతో అలకాపురికి రాజునూ చేసినా శివుడిని మరిచిపోయావు, వస్తువులు అలంకారాలు మీద బ్రాంతి పామరుడికే కానీ పరమేశ్వరుడి ఎందుకు ఉంటుంది అని అంటాడు.
దానితో క్షుపుడికి కోపం వచ్చి దధీజీ మహర్షి పైనా కోపం తెచ్చుకొని కత్తితో అతని తల నరికి అక్కడినుండి వెళ్ళిపోయాడు. అయితే దధీజీ మహర్షి మీద కత్తి ఎత్తిన ఆఖరి క్షణాలలో తన తండ్రి గారైనా శుక్రాచార్యులను ప్రార్ధించాడు. వెంటనే నా పుత్రుడికి ఏదో ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఆశ్రమానికి వెళ్లి చూస్తే దధీజీ తల నరికి పడిఉంది.
అది చూసి శుక్రాచార్యులు మృత సంజీవినిని తెచ్చి తన మంత్రాలతో ఆ తెగిపడినా తలను అతికించి దధీజిని బతికించాడు.
ఆ తరువాత దధీజికి సంజీవినిని ఎలా ఉపయోగించాలో చెప్పి ఈశుక్రాచార్యుడు శివుడిని మనుషులో వేడుకున్నాడు వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమై విషయం ఏంటో చెప్పమన్నాడు.
అప్పుడు శుక్రాచార్యుడు నా పుత్రుడికి ఆత్మరక్షణ కోసం వారలు ప్రసాదించమని వేడుకుంటాడు దాని కారణంగా శివుడు దధీజీ మహర్షికి త్రిశూలాన్ని, వజ్రదేహాన్ని మృత్యువు లేని జీవితాన్ని వారాలుగా ఇస్తాడు.
ఆ తరువాత దధీజీ మహర్షి మహా ఆనందంతో క్షుపుడి రాజ్య స్థానినికి వెళ్లి రాజు సభలో కూర్చొని ఉండగా అందరి ముందే కోపంతో రాజు కిరీటాన్ని తన్నుతాడు.
దానికి రాజుకి విపరీతమైన కోపం వచ్చి క్షుపుడు తన ఆయుధంతో దధీజిని నరకపోయాడు, కానీ ఈ దధీజీ మహర్షి శివుడు ఇచ్చినా ఆయుధాన్ని అడ్డు పెట్టి తనను తాను రక్షించుకున్నాడు. నిండు సభలో క్షుపుడికి ఘోర అవమానం జరిగింది. అది భరించలేక రాజు విష్ణుమూర్తిని ప్రార్ధించాడు.
వెంటనే దధీజీ శివుడిని ప్రార్ధించాడు, దానితో అటు విష్ణుమూర్తి, ఇటు శివుడు ఇద్దరు ఒక్కసారే ఆ సభలో ప్రత్యక్షమైనారు.
ఆతరువాతవిష్ణుమూర్తిమాట్లాడుతూక్షుపరాజబ్రహ్మతేజమునుండిక్షత్రతేజంపనికిరాదునీవుదధీజీమహర్షినిచంపావుఅలాగేశివుడినిఅవమానించావుఅసలుశివుడుఅంటేఎవరోకాదునేనేశివుడినినేనేవిష్ణువునినేనుశివుడువేరువేరుకాదుకాబట్టినీవుశివుడినిఅవమానిస్తేనన్నుఅవమానించినట్లేమాఇద్దరికిభేదంఅనేదేలేదుఅంటాడు.
అలాగే నా భక్తుడు శివుడిని ద్వేషించినా శివభక్తులు నన్ను ద్వేషించినా వారికీ సూర్యుడు,చంద్రుడు ఎంత కాలం ఉంటేరో అంత కాలం వరకు వారికీ నరకబాధలు తప్పవు అని క్షుప రాజుకి విష్ణువు చెప్తాడు.
Moral stories in telugu
ఆ తరువాత శివుడు మాట్లాడుతూ దధీజీ వైపుకు చూసి మహర్షి నువ్వు క్షుప రాజుని అవమానించరాదు, విష్ణ్వoశ లేని వారు రాజుకలేరు రాజులేకపోతే ధర్మం నాశనం అవుతుంది కాబట్టి విష్ణు భక్తులు కానీ నా భక్తులు కానీ ఎలా కొట్టుకోవడం సరికాదు మీ ఇద్దరు హరిహరులను భేదం లేదని గుర్తించండి.
ఇద్దరు అటు విష్ణువు ఎటు శివుడు అదృశ్యమైనారు. కాబట్టి శివుడికి కేశవుడికి బేధం లేదు ఇద్దరు ఒక్కరే ఈ కథ అదే వివరిస్తుంది ఈ కథ శివ పురాణం నుండి గ్రహించబడింది ధన్యవాదాలు.