భీష్ముడి ధర్మ కథ Moral stories in telugu
భీష్ముడు భాణాలపై పడుకోవడం చూసి ధర్మరాజు ఎంతో బాధతో తాతా మాకు ఎన్నో ధర్మాలు చెప్పావు కానీ మేము మన బంధువులందరిని చంపినందుకు నాకు మనశాంతి లేకుండా పోతుంది. అసలు దుర్యోధునుడే ఈ యుద్ధనికి కారణమైనాడు.దుర్యోధనుడి వల్లే మా చేతులతో అందరిని చంపవలసి వచ్చింది అంటాడు.
దానికి భీష్ముడు నాయనా ఒక మనిషి దేనికి కర్తకాడు, వారి కర్మనే కారణమై ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ కార్య కారణ సంభంధం మాత్రం మర్చిపోవొద్దని చెప్పి నీకు ఒక కథ చెప్తాను విను అని భీష్ముడు ధర్మరాజుతో చెప్తున్నాడు.
ఒక బ్రాహ్మణా పిల్లవాడు పాముకరిచి చనిపోయినాడు, తల్లి పాపం ఏడుస్తోంది, అంతలోనే ఒక వ్యక్తి వచ్చి తల్లి ఏడుపు చూసి ఆ పామును పట్టుకొని వచ్చి, ఇదిగో అమ్మ నీ పిల్లవాడిని చంపినా పామును పట్టి తెచ్చాను నీ కసితీరా ఈ పామును కొట్టి చంపు అంటాడు.
అప్పుడు ఆమె ఆ పామును చంపితే నాకేమిటి ప్రయోజనం నా కొడుకు అయితే బ్రతికి వస్తాడా చెప్పు అంటుంది. దానికి ఆ వ్యక్తి ఉంది అయితే నేనే చంపేస్తాను ఈ పామును అంటాడు. వెంటనే ఆ పాము మాట్లాడుతూ.. నేను ఈ పిల్లవాడి మీద పగ పట్టలేదు, రోషావేశాలతో కాటువేయలేదు. నా స్వభావం వల్ల నేను కాటువేశాను.
నా కాటును ఆధారంచేసుకొని మృత్యువు వాడిని చంపింది అన్నది. వెంటనే ఆ వ్యక్తి ఇంకేంటి నీ కాటు వల్లనే మృత్యువు వీడిని చంపింది కదా అని అంటాడు. దానికి ఆ పాము నా కాటు వల్ల కాకపోతే చీమకుట్టడం వల్లనో వాడికి చిరాకు పెట్టడం వల్లనో అతడికి మృత్యువు వచ్చేదని పాము అంటుంది.
Moral stories in telugu
ఇందులో నా తప్పేమి లేదు నేను ఏ జీవినైనా చంపాలనే మనస్థితి నాకు ఉండదు ప్రాణం లేని నిర్జీవులకి యజ్ఞఫలం ఎలా అయితే రాదో అలాగే నా కర్మకు ఎలాంటి పాపం రాకూడదు, ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నీకు పాపం తగలడం మాత్రం ఖాయం.
ఆ పిల్లవాడు చావడంతో ఏదైనా తప్పు ఉండే అది మృత్యువుది అంటుంది. ఇదొక ధర్మబద్దమైన చర్చ కాబట్టి వెంటనే మృత్యువు పరిగెత్తుకుంటూ వచ్చి చూడండి నాకు వ్యక్తిత్వమే లేదు నేను కాలుడికి దాసుణ్ణి నా కర్తవ్యం నేను నెరవేర్చను దీని వాళ్ళ పాపం ఏది వచ్చినా అది కాలుడిదే కానీ నాది కాదు అంటుంది.
వెంటనే కాలుడు అక్కడ ప్రత్యక్షమై నా కర్తవ్యం నేను చేశానని ఈ పిల్లవాడి కర్మఫలం కారణంగానే తనకి ఈ స్థితి అని ఎవరు ఏ కర్మ చేస్తే వారికీ ఆ కర్మఫలం దక్కుతుంది నిన్నటి పువ్వే ఇవాళ కాయ అయినట్లు నిన్నటి కర్మనే ఇవాళ కార్యం అవుతుందని అలా కావడానికి నేను కేవలం అనుసంధాన కర్తను మాత్రమే అని చెప్తాడు.
ఏ ఉదేశ్యం లేకుండా ఈ పాముకి అలాగే మృత్యువుకి, అదేవిధంగా నాకు ఎలాంటి పాపం తగలదు. ఈమె దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలితం రావడమే కర్మసిద్ధతం అని కాలుడు చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత భీష్ముడు ఈ కథ చెప్పి అన్నిటికి నీవే కారణమని అలాగే దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు యుద్ధంలో పలుగున్న వారంతా వారి వారి కర్మఫలితం వల్లనే మరణించారు. అంతేకాని వారివారి పాపపుణ్యాలు వచ్చి నిన్ను అంటుకోవు అని అంటాడు.
కానీ ధర్మం తెలిసి కూడా అన్యాయం అని అర్ధం అయ్యి కూడా తెలివి ఉండే దుర్యోధనుడి లాగా చేస్తే వారికీ ఖచ్చితంగా పాపం తగులుతుందని ఒక జన్మలో చేసిన పాపం శరీరం విడిచాక మరొక జన్మలో మరో శరీరంతో ఉన్నపుడు ఈ పాపాలు అనుభవిస్తారు అదే కర్మసిద్ధాంతంఅని భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు.
దుర్యోధనుడు చేసినా కర్మకి ఈరోజు కారణమై నీ ముందు నిలుచుంది. అది కేవలం అతడి కర్మఫలితమే నీవు భగవంతుడిని ధ్యానించి ధర్మ మార్గంలోనే నడిచావు వారుచేసినా కర్మకి నీవు బాధపడకు అని భీష్ముడు చెప్తాడు.