భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన కథ Moral stories in telugu
ధర్మరాజు పాము చేసే కర్మలు స్వభావం చేత అయ్యి పాపా పుణ్యాలు తగలవు అన్నారు కదా తాతా మరి ఒక గ్రహస్తుడు స్వభావం చేత కర్మలు చేసే వారు మరణాన్ని జయించగలుగుతారా అని అడుగుతాడు.
దానికి భీష్ముడు తప్పకుండా చేయించొచ్చు అని దానికి ఇంకొక కథ వివరిస్తున్నాడు అది అగ్నిదేవుడికి అలాగే సుదర్శన అనే ఆమెకి ఒక కొడుకు పుట్టాడు అయినా పేరు సుదర్శనుడు. ఇతను ఒక రాజుగానే ఉండు గృహస్థ ధర్మం పాటిస్తూనే మృత్యువుని జయిస్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
అయితే ఒక గృహస్థుడు ధర్మభధంగా ఉంటాను అనేది బాగానే ఉంది కానీ దానిని ప్రతిజ్ఞ చెయ్యడం అనేది గమనించాల్సిన విషయం. నిజానికి భగవంతుడు సర్వం మనుషులతో పాపా పుణ్యాలు చేయిస్తూ ఉంటె మధ్యలో ఇతని ప్రతిజ్ఞ ఏమిటి అని ఈ సుదర్శనుడని పరీక్షించాలని ధర్మదేవత అనుకుంటుంది.
అయితే ఒక గృహస్థుడు అతిథులను పూజించాలనే నియమం మొదటగా పాటించాలి. ఇలానే ఈ సుదర్శనుడు అతిధులను గౌరవించుకుంటూ తన సంపద అంత దానం చేసి యమనీయమది నిష్టలతో ఒక పర్ణశాల కట్టుకొని అందులో తన భార్యతో సహా నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు ఓఘవతి, ఈమెకి సుదర్శనుడు అతిధి ధర్మం గురించి బోధించి అతిథులను నేను ఇంట్లో లేని సమయంలో నీవు పూజించాలి అని చెప్తాడు.
ఒకవేళ అతిధి దేవుడు ఆమె శరీరాన్ని కోరుకున్న సరే నీవు దాన్ని ఇవ్వడానికి వెనకకు పోకూడదని చెప్పి నీవు అలా చెయ్యాలి అని కోరుకున్నాడు.
దానికి ఆమె బాధ పడిన తరువాత ఒప్పుకుంది. అయితే ధర్మదేవత ఈ ప్రతిజ్ఞకు వీరిని పరీక్షించడానికి సుదర్శనుడు పర్ణశాలలో లేని సమయం చూసి ఇంటికి వచ్చి తలుపు కొడుతుంది ఈ ఓఘవతి లోపలి పిలిచి అతిధి పూజ చేసి ఆదరిస్తుంది, కానీ ధర్మదేవత మగ వారి రూపంలో ఉంది కాబట్టి ఆమె పట్ల కామకోరిక ఉందని దానిని తీర్చమని అడిగాడు.
ఈ ఓఘవతి అనేక రకాలైన సుఖశాంతులు ఉండే వస్తువులని మీకు ఇస్తాను ఈ కోరిక మానుకోండి అని వేడుకుంటుంది. ఎన్ని విధాలుగా చెప్పినా అతను ఒప్పుకోదు. ఇక ఆమె తన భర్త ఆజ్ఞను అనుసరించి అతనిని తృప్తి పరచడానికి చాటుకి తీసుకొని పోతుంది. అదే సమయంలో సుదర్శనుడు ఎక్కడినుండో వచ్చి తన ఇంటి వాకిట్లో నిలబడి ఓఘవతిని పిలుస్తుండాడు.
వెంటనే ఆ అతిధి ఓఘవతిని మాట్లాడనీయకుండా అతడే సమాధానం చెప్తూ నీ భార్య అతిథినైనా నాకు కామతృప్తిని ఇవ్వడానికి నా పక్కన ఉంది అందువల్ల నీవు అక్కడే కొద్దిసేపు వేచి ఉండు అంటాడు.
వెంటనే సుదర్శనుడు ఓ అతిధి దేవత మీ రాకకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అతిధులను గృహంలో పూజించడం వల్ల పుంణ్యలోకాలకు పోతారంటారు, నేను ఆ దారిలోనే నడుస్తున్నాను కాబట్టి నా కర్తవ్యంగా నేను ఎలాంటి తొందర లేకుండా ఇక్కడే వేచిచూస్తాను అంటాడు.
ఈ పరీక్షా సుదర్శనుడికే ఓఘావతికీ కాదు ఆమె మనసు ఎంతో గొప్పది కాబట్టి భర్తతో పాటుగా స్వర్గానికి వెళ్లపోతుంది ఇక ధర్మదేవత వెంటనే సుదర్శనుడి ముందు ప్రత్యక్షమై ఓ సుదర్శనా నీవు నిజంగా మృత్యువునే జయించావు, కామరోషా వికారాలను విడిచిపెట్టి స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్న నిన్ను మృత్యువు ఏమి చేయదని
అలాగే నీవు ఈ శరీరంతోనే ఊర్ధ్వలోకాలకు ఏళ్లొచ్చని ఓఘవతిని తన శరీరంలో సగభాగం నదీరూపంలో ఇక్కడే ఉంటూ మరొక సగభాగాన్నీ నిన్ను అనుసరిస్తూ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక సుదర్శనుడు తన భార్యతో స్వర్గానికి వెళ్ళిపోతారు. భీష్ముడు ఈ కథ ధర్మరాజుతో చెప్పి నీవు కామక్రోధాలను విడిచిపెట్టి ఉండాలి అని చెప్తాడు.
ఈ కథని ఒక పిచ్చి కథ అనే వారే చాలా మంది ఉంటారు కానీ మంచి పనులు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి అని కర్మ సిద్ధాంతం చెపుతుంది అసలు ఏది మంచి ఏది చెడు అతిథి కోరిన దాన్ని దానం చేయడం మంచే కానీ ఓఘవతి పాతివ్రత్యం కాపాడుకోవడం కూడా మంచే కదా ఈ రెండు ఒకేసారి పూర్తి అయ్యే అవకాశం లేదని ఆమెకి తెలిసి
ఏ మంచికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచించుకొని తన పాతివ్రత్యం కంటే భర్త చెప్పిన మాటకే ఎక్కువ విలువ ఇచ్చి తనను తాను త్యాగం చేసుకోవడం వల్లే ఆమెకి స్వర్గలోక ప్రాప్తి లభించిందని చెప్పాడు.
అలాగే మృత్యువు అనేది ఒక వ్యక్తికి కాదు అది కేవలం శరీరానికి మాత్రమే సుదర్శనుడు శరీరానికే మృత్యువు రాకుండా జయించాడు పూర్వజన్మలు లేవు కోరికలు లేవు ఈ శరీరం వదిలి ఇంకోశరీరం పొందాలి అనే ఆలోచనలు అతనికి లేవు కాబట్టే సుదర్శనుడికి చావులేదు. ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకు ఎవరైతే కామక్రోధాలను విడిచిపెట్టి ఎవరైతే బ్రతుకుతారో వారు మృత్యువుని జయించినట్లే.
అదేవిధంగాధర్మరాజుకిఇంకొకసందేహంకూడావచ్చిఇలాఅడుగుతున్నాడుఅసలుమంచికర్మలుచేసినావారికీ వాటి వల్ల ఏమిటి లాభం అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, ఎవరైతే మంచి పనుల కోసం ప్రయత్నం చేస్తారో వారికీ భగవంతుడే ఫలితం ఇస్తాడు అని భీష్ముడుచెప్పగానే ధర్మరాజు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు తాతా అని అడుగుతాడు?
వెంటనే భీష్ముడు ఒకవేళ యజ్ఞం చేసి అన్న దానం చేస్తే దాని ఫలితం అంత ఇంత కాదు అలాగే దానం చేసే వస్తువుని భట్టి కూడా ఫలితామనేది ఉంటుంది కోపం చూపించకుండా మౌనంగా ఉంటె పరిజ్ఞాన శక్తి పెరుగుతుంది, అలాగే తాపం వాళ్ళ భోగం వస్తుంది, బ్రహ్మచర్యం వాళ్ళ ఆయుష్షు పెరుగుతుంది. అహింస వాళ్ళ ఐశ్వర్యం కలుగుతుంది, సత్య వ్రతానికి ముక్తి ఫలితం ఉంటుంది.
చెట్లకి ఆకులూ, చిగుళ్లు, పువ్వులు, కాయలు, పండ్లు, ఎలా అయితే వస్తాయో అలాగే కర్మను భట్టి కర్మఫలితం ఉంటుందని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. అలాగే మరొక సందేహం కూడా ధర్మరాజు భీష్ముడిని అడుగుతాడు అదేంటో మరొక వీడియోలో నేను తెలియజేస్తాను ధన్యవాదాలు.